న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్న భారత మహిళా క్రికెటర్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రస్తుతం ముంబైలో కట్టుదిట్టమైన క్వారంటైన్లో ఉన్న క్రికెటర్లు శుక్రవారం వ్యాక్సిన్ తొలి డోస్ వేసుకున్నారు. ఇప్పటికే కొంతమంది ప్లేయర్లు కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోగా, మిగిలిన వారు వ్యాక్సినేషన్లో పాల్గొన్నారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. టీమ్ఇండియా ఆల్రౌండర్ దీప్తిశర్మ వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.ఇంగ్లండ్కు వెళ్లనున్న రెండు జట్లకు చెందిన ప్లేయర్లకు తొలి డోస్ కింద కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించిన బీసీసీఐ.. ఇంగ్లండ్లో రెండో డోసు కోసం ఏర్పాట్లు చేస్తున్నది.