సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా .. సిడ్నీ టెస్టుతో మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగువ టెస్టు రెండవ ఇన్నింగ్స్లోనూ ఖవాజా సెంచరీ చేశాడు. సిడ్నీ మైదానంలో రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు కొట్టిన మూడవ ఆస్ట్రేలియా ప్లేయర్గా నిలిచాడు. గతంలో డగ్ వాల్టర్స్, రికీ పాంటింగ్లు ఈ ఫీట్ అందుకున్నారు. ఇక యాషెస్ సిరీస్లో రెండు ఇన్నింగ్స్లో రెండు సెంచరీలు చేసిన 9వ ఆటగాడిగా కూడా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్లో ఖవాజా తొలి ఇన్నింగ్స్లో 137 రన్స్, రెండవ ఇన్నింగ్స్లో 101(నాటౌట్) రన్స్ చేశాడు. ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్ను 265 పరుగల వద్ద డిక్లేర్ చేసింది. అయితే 388 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 30 రన్స్ చేసింది. అయిదో రోజు ఇంగ్లండ్ టార్గెట్ను చేధిస్తుందా లేక తేలిపోతుందా చూడాల్సిందే. ఇప్పటికే సిరీస్ను 3-0 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకున్నది.
స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా 416-8, 265-6
ఇంగ్లండ్ 294, 30-0