దుబాయ్: అగ్రరాజ్యం అమెరికా ఐసీసీ అండర్-19 వన్డే వరల్డ్కప్నకు అర్హత సాధించింది. వచ్చే ఏడాది శ్రీలంకలో జరుగనున్న టోర్నీ కోసం నిర్వహిస్తున్న అర్హత టోర్నీలో అమెరికా దుమ్మురేపింది. ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదింట నెగ్గిన అమెరికా 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ప్రపంచకప్ బెర్తు దక్కించుకుంది.
అర్జెంటీనాతో జరిగిన ఓ మ్యా చ్లో అమెరికా 515 పరుగుల భారీ స్కోరు చేసి.. ప్రత్యర్థిని 450 రన్స్ తేడాతో చిత్తు చే యడం విశేషం. ఇప్పటికే భారత్, అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే వన్డే ప్రపంచకప్ టోర్నీకి ఎంపికయ్యాయి.