Urvashi Rautela | టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్నారు. ప్రమాదం అనంతరం డెహ్రాడూన్ మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్ను మెరుగైన చికిత్స కోసం బీసీసీఐ ముంబయికి తరలించిన విషయం తెలిసిందే. కాగా, పంత్ ప్రమాదానికి గురైన కొన్ని గంటల తర్వాత ‘ప్రార్థిస్తున్నా’ అని పోస్ట్ చేసిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా.. ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ముంబయిలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రి ఫొటోను షేర్ చేసింది. పంత్ను ముంబయికి షిప్ట్ చేసిన కొన్ని గంటలకే ఆమె ఈ పోస్ట్ చేయడం గమనార్హం.
కాగా, పంత్-ఊర్వశి రౌతేలా రిలేషన్షిప్లో ఉన్నారంటూ గతంలో అనేక పుకార్లు వచ్చాయి. 2018 నుంచి వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. ఇద్దరూ కలిసి రెస్టారెంట్లు, షాపింగ్, పార్టీలు అంటూ చట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో వీరు డేటింగ్లో ఉన్న వార్తలకు బలం చేకూర్చాయి. అయితే, 2019లో ఈ వార్తలను పంత్ ఖండించారు. తన గర్ల్ఫ్రెండ్ ఇషా నేగితో రిలేషన్ షిప్లో ఉన్నట్లు తెలిపారు. ఇషాతో ఉన్న ఫొటోలను సైతం అప్పట్లో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అయినప్పటికీ పంత్-ఊర్వశిపై పుకార్లు ఆగడం లేదు. ఏదో ఒకరకంగా ఇద్దరూ నెట్టింట వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
రిషబ్ పంత్ ఈ నెల 30వ తేదీన ఢిల్లీ నుంచి రోర్కీ వెళ్తుండగా అతను ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై డివైడర్ను ఢీ కొట్టింది. ప్రమాదం తర్వాత కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పంత్ వెంటనే కారు అద్దాలు పగులగొట్టి బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. ప్రమాదం అనంతరం అతను డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అక్కడ వైద్యులు అతనికి పలు సర్జరీలు చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం పంత్ను బీసీసీఐ ముంబయికి తరలించింది. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు.