WPL | బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. సొంతగడ్డపై అభిమానుల అపూర్వ మద్దతు మధ్య బరిలోకి దిగిన ఆర్సీబీ సోమవారం జరిగిన మ్యాచ్లో 23 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 198-3 స్కోరు చేసింది. కెప్టెన్ స్మృతి మందన(50 బంతుల్లో 80, 10ఫోర్లు, 3సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్తో చెలరేగగా, ఎలీస్ పెర్రీ(58) అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. ఓపెనర్ మేఘన(28) నిరాశపర్చగా, మందన, పెర్రీ ఇన్నింగ్స్ను నిలబెట్టారు.
వీరిద్దరి కలిసి రెండో వికెట్కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మందన తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తూ మైదానం నలువైపులా బౌండరీలతో చెలరేగింది. శర్వాణి, దీప్తిశర్మ, ఎకల్స్టోన్ ఒక్కో వికెట్తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన యూపీ వారియర్స్ 175-8 స్కోరు చేసింది. కెప్టెన్ అలీస్సా హిలీ(55), దీప్తిశర్మ(33) ఫర్వాలేదనిపించారు. సోఫీ డివైన్, మోలినిక్స్, వేర్హామ్, శోభన రెండేసి వికెట్లు తీశారు. మందనకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. మంగళవారం నుంచి ఢిల్లీ వేదికగా డబ్ల్యూపీఎల్ మ్యాచ్లు మొదలుకాబోతున్నాయి.