బెంగళూరు : ప్రొ కబడ్డీ లీగ్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో యుపి యోధాస్ 41-24 స్కోరుతో తమిళ్ తలైవాస్ జట్టుపై ఘన విజయం సాధించింది. యోధాస్ జట్టులో సుమీత్ 7, ప్రదీప్ నర్వాల్ 6, అషు సింగ్ 6, సురేందర్ గిల్ 4, నితీష్ కుమార్ 3, రతన్ 3 పాయింట్లు సాధించగా, తలైవాస్కు హిమాంశు 7, సాహిల్ 6, నరేందర్, అభిషేక్, మోహిత్, సాగర్ తలా రెండు పాయింట్లు సాధించారు. అంతకుముందు బెంగళూరు బుల్స్, పట్నా పైరేట్స్ మధ్య జరిగిన మ్యాచ్ 31-31 స్కోరుతో డ్రాగా ముగిసింది. బెంగళూరు జట్టులో భరత్ 11, నీరజ్ నర్వాల్ 4, సౌరభ్ నందల్ 3, వికాస్ కండోల 3, మహేందర్ సింగ్ 3 పాయింట్లు సాధించగా, పట్నా జట్టులో రోహిత్ గులియా 8, సచిన్ 6, మనీష్ 4 పాయింట్లు సాధించారు.