WPL 2024 | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ -2024)లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతులెత్తేసింది. 139 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. 19.5 ఓవర్లలోనే 137 పరుగులకు ఆలౌట్ అయింది. మెగ్ లానింగ్ 60, జెమినాహ్ రోడ్రిగ్స్ 17, షఫాలీ వర్మ 15, అలిసే క్యాప్సే 15 పరుగులు మినహా మిగతా వారెవ్వరూ క్రీజులో నిలవలేక పోయారు. యూపీ వారియర్స్ బౌలర్లలో దీప్తి శర్మ నాలుగు, గ్రేస్ హరిస్ రెండు, సైమా ఠాకూర్ రెండు, సోఫీ ఎకెల్ స్టోన్ ఒక వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేశారు. వారిలో దీప్తి శర్మ 59, అల్యేషా హీలీ 29, గ్రేస్ హారిస్ 14 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు రాధా యాదవ్, టిటాస్ సాధు రెండేసి వికెట్లు, షికా పాండే, అరుంధతి రెడ్డి, జెస్ జొన్నాసెన్, అలెస్ క్యాప్ సే ఒక్కో వికెట్ తీశారు.