న్యూఢిల్లీ: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ‘ఫిట్ ఇండియా’ యాప్ను ఆవిష్కరించారు. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జన్మదినం సందర్భంగా ఢిల్లీలోని ధ్యాన్చంద్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఠాకూర్ ఈ యాప్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఫిట్ ఇండియా యాప్ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చే బహుమతి. క్రీడాకారులందరూ ఫిట్గా ఉండటానికి తప్పనిసరిగా దీనిని వాడాలి. ఇది మిమ్మల్ని ఎప్పుడూ యవ్వనంగా, ఫిట్గా ఉంచేందుకు సాయపడుతుంది’ అని అన్నారు. ఇదే కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న హాకీ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘సాధారణంగా మనం ఫిట్నెస్కు అంత ప్రాధాన్యత ఇవ్వం. కానీ రోజులో ఒక అరగంట పాటు వ్యాయామానికి కేటాయించాలి. ఫిట్ ఇండియా యాప్ను నేను వాడుతున్నాను. దీనిని వాడటం చాలా సులువు’ అని అన్నాడు.