తరోబా: పరిమిత వనరులతోనే బరిలోకి దిగిన యువ భారత జట్టు అండర్-19 ప్రపంచకప్లో అద్వితీయమైన విజయంతో క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. కరోనా వైరస్ కారణంగా ఆరుగురు ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా బుధవారం రాత్రి జరిగిన పోరులో యంగ్ఇండియా 174 పరుగుల తేడాతో ఐర్లాండ్ను చిత్తు చేసింది. తొలుత టీమ్ ండియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. హర్నూర్ సింగ్ (88; 12 ఫోర్లు), రఘువంశీ (79; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించగా.. రాజ్ బవా (42), కెప్టెన్ నిషాంత్ సింధు (36), రాజ్వర్ధన్ (39) రాణించారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 39 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో వికీ, కౌషల్, గర్వ్ సాంగ్వాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన యంగ్ ఇండియా.. వరుసగా రెండో విజయంతో నాకౌట్కు అర్హత సాధించింది.