మీర్పూర్: ఇండియాతో జరుగుతున్న రెండవ టెస్టులో బంగ్లాదేశ్ తొలి రోజు భోజన విరామ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 82 రన్స్ చేసింది. అయితే లంచ్ బ్రేక్ తర్వాత షకీబ్ ఔట్ అయ్యాడు. ఉమేశ్ వేసిన తొలి బంతికే అతను క్యాచ్ అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో ఇండియా తరపున ఉనద్కత్ ఆడాడు. ఓపెనర్లు షాంతో, జకీర్లు తొలి సెషన్లో మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. ఆ ఇద్దరూ తొలి వికెట్కు 39 రన్స్ జోడించారు. షాంతో 24, జకీర్ 15 రన్స్ చేసి ఔటయ్యారు. షకీబ్ 16 రన్స్ చేసి ఔటయ్యాడు. మోమినునల్ హక్ 23 రన్స్తో క్రీజ్లో ఉన్నాడు. ప్రస్తుతం బంగ్లా 30 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 91 రన్స్ చేసింది. తొలి టెస్టులో ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే.
Umesh Yadav strikes straight up after Lunch.
Shakib Al Hasan departs for 16.
Live – https://t.co/XZOGpedaAL #BANvIND pic.twitter.com/pQq3ChKWhg
— BCCI (@BCCI) December 22, 2022