హైదరాబాద్, ఆట ప్రతినిధి: అల్టిమేట్ ఖో-ఖో సీజన్-2లో తెలుగు యోధాస్ అదరగొట్టింది. ఆదివారం హోరాహోరీగా సాగిన పోరులో తెలుగు యోధాస్ 46-44తో ముంబై ఖిలాడీస్పై విజయం సాధించింది. కటక్ వేదికగా అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ టోర్నీ తొలి పోరులో తెలుగు యోధాస్ తరఫున రాహుల్ మండల్ 14 పాయింట్లతో సత్తాచాటాడు.
ప్రతీక్ 10 పాయింట్లతో అతడికి అండగా నిలువడంతో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో తెలుగు యోధాస్ రెండు పాయింట్ల తేడాతో నెగ్గింది. మరో పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఒడిషా జగ్గర్నాట్స్ 35-27తో రాజస్థాన్ వారియర్స్పై గెలుపొందింది.