అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యువభారత జట్టు ఇంగ్లండ్కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఐదోసారి ప్రపంచకప్ గెలవాలనే కసితో ఆడుతున్న భారత అండర్-19 జట్టు టాస్ ఓడి బౌలింగ్ చేస్తోంది. బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టును భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెడుతున్నారు. రాజ్ బవా, రవి కుమార్ ఇద్దరూ అదరగొట్టడంతో ఇంగ్లిష్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. వీరి ధాటికి ఇంగ్లండ్ జట్టు 13 ఓవర్లలో 47 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది.
ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ జట్టు తీవ్రమైన కష్టాల్లో మునిగిపోయింది. ఇంగ్లండ్ ఓపెనర్ జార్జ్ థామస్ (27) కొంత ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ జాకబ్ బెథెల్ (2), కెప్టెన్ టాప్ ప్రెస్ట్ (0), విలియమ్ లక్స్టన్ (4), జార్జ్ బెల్ (0) తీవ్రంగా నిరాశపరిచారు. జేమ్స్ ర్యూ (15 నాటౌట్), రెహాన్ అహ్మద్ (2 నాటౌట్) క్రీజులో ఉన్నారు.