హైదరాబాద్, ఆట ప్రతినిధి: మహిళల అండర్-19 టీ20 టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ త్రిష అదరగొడుతున్నది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న నాలుగు జట్ల టోర్నీలో ఆకట్టుకుంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ ‘బి’ తరఫున బరిలోకి దిగిన త్రిష 49 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. ఈ యువ బ్యాటర్తో పాటు సవకర్(30), నిఖి ప్రసాద్(22) రాణించడంతో భారత్ ‘బి’ నిర్ణీత ఓవర్లలో 125/5 స్కోరు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన లంక.. 113/9 స్కోరుకు పరిమితమైంది.