Nikhat Zareen | సోఫియా: రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలో రజత పతకం కైవసం చేసుకుంది. మహిళల 50 కేజీల ఫైనల్లో ఆదివారం నిఖత్ 2-3తేడాతో సబీనా (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓటమి పాలైంది.
తొలి రెండు రౌండ్లు ఇద్దరు బాక్సర్లు ఒకరిపై మరొకరు పంచ్లతో విరుచుకుపడ్డారు. నిఖత్ డిఫెన్స్ బలహీనపడ్డ ప్రతిసారీ ప్రత్యర్థి గట్టి పంచ్లతో పాయింట్లు కొల్లగొట్టింది. ఇతర మ్యాచ్ల్లో అమిత్ పంగల్ (51 కేజీలు), సచిన్ (57 కేజీలు) స్వర్ణ పతకాలు సాధించగా.. అరుంధతి చౌదరీ (66 కేజీలు), బరున్ సింగ్ (48 కేజీలు), రజత్ (67 కేజీలు) రజత పతకాలు గెలుచుకున్నారు.