గజ్వేల్ అర్బన్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ వేదికగా 49వ రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి శివకుమార్తో పాటు క్రీడల నిర్వహణ కమిటీ శ్రమించి టోర్నీ ఏర్పాట్లు చేసింది.
ఈ పోటీల్లో 33 జిల్లాల నుంచి బాలబాలికల జట్లు పోటీపడుతుండగా, వెయ్యి మంది ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. ఈ నెల 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు పోటీలు జరుగనున్నాయి. ప్రతాప్రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పతకాలను ఆవిష్కరించగా, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు గజ్వేల్ ఆతిథ్యమివ్వడం గర్వంగా ఉందన్నారు.