హైదరాబాద్, ఆట ప్రతినిధి: అండర్-19 మహిళల జాతీయ చాలెంజర్ ట్రోఫీకి రాష్ర్టానికి చెందిన జి.త్రిష, మమత ఎంపికయ్యారు. జైపూర్ వేదికగా జరుగనున్న ఈ టొర్నీలో వీరిద్దరూ పాల్గొననున్నారు. ఇటీవలి కాలంలో దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న టాపార్డర్ బ్యాటర్ త్రిష.. ఈ టోర్నీలో సత్తాచాటి జాతీయ సెలెక్టర్ల దృష్టిలో పడాలని తహతహలాడుతున్నది. కరోనా వైరస్ నేపథ్యంలో టోర్నీకి ముందు ఐదు రోజుల పాటు క్వారంటైన్ తప్పనిసరి కాగా.. నవంబర్ 7న పోటీలు ముగియనున్నాయి.