హోబర్ట్: మిడిలార్డర్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ (101; 12 ఫోర్లు) సెంచరీతో కదం తొక్కడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆసీస్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. డేవిడ్ వార్నర్ (0), ఉస్మాన్ ఖవాజా (6), స్టీవ్ స్మిత్ (0) విఫలమవడంతో ఆస్ట్రేలియా 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో లబుషేన్ (44), కామెరూన్ గ్రీన్ (74)తో కలిసి హెడ్ ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. గులాబీ బంతితో జరుగుతున్న యాషెస్ చివరి పోరులో ప్రస్తుతం అలెక్స్ కారీ (10), స్టార్క్ (0) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, రాబిన్సన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.