న్యూఢిల్లీ : ప్రతిష్ఠాత్మక హాకీ ప్రపంచకప్లో భారత జట్టుకు కఠిన డ్రా ఎదురైందని మాజీ కెప్టెన్ జాఫర్ ఇక్బాల్ వ్యాఖ్యానించాడు. 47 ఏండ్ల కలను సాకారం చేసుకోవాలంటే భారత జట్టు ఎంతో శ్రమించాల్సి ఉంటుందన్నాడు. ప్రపంచకప్లో భారత్ తలపడే పూల్ ‘డి’లో స్పెయిన్, ఇంగ్లండ్, వేల్స్ జట్లు ఉన్నాయని, వాటిని దాటుకుని టైటిల్ పోరుకు చేరుకోవాలంటే శక్తికి మించిన ప్రదర్శన చేయాలన్నాడు.