టోక్యో: ఇండియాకు బాక్సింగ్లో కచ్చితంగా మెడల్ తీసుకొస్తాడనుకున్న బాక్సర్ అమిత్ పంగాల్కు షాక్ తగిలింది. అతడు ప్రిక్వార్టర్స్లోనే ఇంటిదారి పట్టాడు. కొలంబియా బాక్సర్ మార్టినెజ్ రివాస్తో జరిగిన ప్రిక్వార్టర్స్ బౌట్లో1-4 తేడాతో అమిత్ పరాజయం పాలయ్యాడు. 48-52 కేజీల ఫ్లైవెయిట్ కేటగిరీలో టాప్ సీడ్గా బరిలోకి దిగిన అమిత్.. ఈసారి మెడల్ హాట్ ఫేవరెట్లలో ఒకడిగా ఉన్నాడు. కానీ అతడు కనీసం క్వార్టర్స్కు చేరుకోకపోవడం తీవ్ర నిరాశ కలిగించేదే. బౌట్ మొత్తం అటాకింగ్ కంటే డిఫెన్స్కే ప్రాధాన్యమిచ్చిన అమిత్.. తగిన మూల్యం చెల్లించాడు.