రంగారెడ్డి : జిల్లాలోని రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి జన చైతన్య వెంచర్లో గుర్తు తెలియని యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం పై నుంచి కింద పడి మృతి చెందింది.
స్థానికుల సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు యువతి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అనే వివరాలు సేకరిస్తున్నారు. యువతి భవనం నుంచి ప్రమాదవశాత్తు కింద పడిందా? లేక ఎవరైనా తోసేసారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.