ఆక్లాండ్: ఇండియాతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ ఏడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. టామ్ లాథమ్ 145 రన్స్తో నాటౌట్గా నిలిచాడు. 307 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన కివీస్.. ఇంకా 17 బంతులు ఉండగానే విజయాన్ని సొంతం చేసుకున్నది. నాలుగో వికెట్కు లాథమ్, విలియమ్సన్ అజేయంగా 221 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ విలియమ్సన్ 94 రన్స్తో నాటౌట్గా నిలిచాడు. లాథమ్(145 నాటౌట్) ఇన్నింగ్స్లో 19 ఫోర్లు అయిదు సిక్సర్లు ఉన్నాయి. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
Tom Latham and Kane Williamson master a memorable chase against India ⭐
Watch the #NZvIND ODI series LIVE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺
📝 Scorecard: https://t.co/eVO5qCY6fe pic.twitter.com/GBEpDunT9C
— ICC (@ICC) November 25, 2022
తొలుత భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభమన్ గిల్ తొలి వికెట్కు 124 రన్స్ జోడించారు. ధావన్ 72, గిల్ 50 రన్స్ చేసి ఔటయ్యారు. ఆ తర్వాత పంత్, సూర్యకుమార్ కూడా త్వరత్వరగా ఔటయ్యారు. అయిదో వికెట్కు శ్రేయాస్, సంజూ సాంసన్ మధ్య కీలక భాగస్వామ్యం నెలకొన్నది. ఆ ఇద్దరూ 94 రన్స్ జోడించారు.
అయ్యర్ 80 రన్స్ చేసి ఔట్ అవ్వగా, సాంసన్ 36 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇక చివర్లో వాషింగ్టన్ సుందర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారీ షాట్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతను 16 బంతుల్లోనే 37 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్లు చెరో మూడేసి వికెట్లు తీసుకున్నారు.