న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత మహిళా స్విమ్మర్గా మానా పటేల్ నిలిచింది. యూనివర్సాలిటీ కోటా కింద మానా పటేల్ ఈ అవకాశం దక్కించుకుందని భారత స్విమ్మింగ్ సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) శుక్రవారం వెల్లడించింది. విశ్వక్రీడల్లో మానా పటేల్ 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో బరిలోకి దిగనుంది. పురుషుల విభాగంలో సాజన్ ప్రకాశ్, శ్రీహరి నటరాజన్ ఇప్పటికే టోక్యో క్రీడలకు అర్హత సాధించగా, మూడో భారత స్విమ్మర్గా మానా నిలిచింది. ఈ సందర్భంగా కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.