ఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా శనివారం మణిపూర్తో జరిగిన మ్యాచ్లో తిలక్వర్మ అజేయ సెంచరీ(126 నాటౌట్)తో అదరగొట్టాడు. దీంతో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత మణిపూర్ 8 వికెట్లకు 191 పరుగులకు ఆలౌట్ కాగా సమాధానంగా హైదరాబాద్ 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. తిలక్ వర్మ 77 బంతుల్లో 7 సిక్సర్లు, 14 ఫోర్లతో 126 పరుగులతో అజేయంగా నిలిచాడు. లక్ష్యఛేదనలో రోహిత్రాయుడు(39)తో కలిసి తిలక్.. నాలుగో వికెట్కు 154 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు.