హైదరాబాద్, ఆట ప్రతినిధి: వినూ మన్కడ్ టోర్నీలో హైదరాబాద్ అదిరిపోయే విజయంతో ఆకట్టుకుంది. బుధవారం రాజస్థాన్తో జరిగిన వన్డే మ్యాచ్లో హైదరాబాద్ మూడు వికెట్ల తేడాతో(వీజేడీ పద్ధతి) గెలిచింది. రాజస్థాన్ నిర్దేశించిన 261 పరుగుల లక్ష్యఛేదనలో వర్షం అంతరాయం కల్గించే సమయానికి 40.2 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు చేసింది. ఓవైపు సహచరులు వెంటవెంటనే నిష్క్రమిస్తున్నా..నాయకునిగా ఠాకూర్ తిలక్వర్మ(114 బంతుల్లో 156 నాటౌట్;12 ఫోర్లు, 9 సిక్స్లు) జట్టును ముందుండి నడిపించాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. అంతకుముందు శశాంక్(3/38), రాఘవ(2/40) ధాటికి రాజస్థాన్ 45 ఓవర్లలో 260/7 స్కోరు చేసింది.