IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. దాంతో టాస్ ఆలస్యం అయ్యేలా ఉంది. అహ్మదాబాద్లో ఆదివారం (మే28) సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే.. మ్యాచ్ యథావిధిగా జరిగే అవకాశం ఉందట. ఒకవేళ భారీ వర్షం కురిస్తే రిజర్వ్ డేన ఫైనల్ నిర్వహిస్తారు. వర్షం కారణంగా ఇదే స్టేడియంలో శుక్రవారం క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆలస్యంగా మొదలైన విషయం తెలిసిందే. పిచ్ను పరిశీలించిన అంపైర్లు 7ః45కు టాస్ వేశారు. 8 గంటలకు గుజరాత్ టైటాన్స్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభమైంది.
పదోసారి ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదో ట్రీఫీపై గురిపెట్టింది. మరోవైపు గుజరాత్ వరుసగా రెండో సారి ఫైనల్ చేరింది. అయితే.. క్వాలిఫైయర్ 1లో చెన్నై 15 రన్స్ తేడాతో గుజరాత్ను చిత్తు చేసింది. దాంతో, ఫైనల్లో ఎవరు పై చేయి సాధించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్లో తొలిసారి గుజరాత్ను ఓడించిన సీఎస్కే ఫైనల్లో అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.
ఐపీఎల్ 2023 ట్రోఫీతో హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోనీ
క్వాలిఫైయర్ 2 పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. ఆల్రౌండ్ షోతో ముంబై ఇండియన్స్పై 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ శుభ్మన్ గిల్(129: 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్లు) ముంబైని ముంచాడు. అతడు సెంచరీ బాదడంతో గుజరాత్ 2 వికెట్ల నష్టానికి 233 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్(55) ఒక్కడే పోరాడాడు. అయితే.. సీనియర్ పేసర్ మోహిత్ శర్మ 5 వికెట్లు తీయడంతో ముంబై 171కు ఆలౌటయ్యింది.