దుబాయ్: వచ్చే ఏడాది అమెరికాలో తొలిసారి జరుగనున్న టీ20 ప్రపంచకప్ వేదికలు ఖరారయ్యాయి. ఫ్లోరిడా(బ్రోవర్డ్ కౌంటీ), డల్లాస్(గ్రాండ్ ప్రియరీ), న్యూయార్క్(ఎసెన్హోవర్ పార్క్) వేదికలు మెగాటోర్నీ మ్యాచ్లకు ఆతిథ్యమిస్తాయని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ అల్లార్డైస్ బుధవారం పేర్కొన్నాడు.
వెస్టిండీస్తో కలిసి అమెరికా పొట్టి ప్రపంచకప్ టోర్నీకి మొదటిసారి ఆతిథ్యమివ్వబోతున్నది. ఇందుకు సంబంధించి 2021లోనే ఆతిథ్య హక్కులను ఐసీసీ ఈ రెండు దేశాలకు కట్టబెట్టింది.