దుబాయ్: ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంగ్లండ్ ( India vs England )తో జరగాల్సిన ఐదో టెస్ట్ రద్దవడంపై మొత్తానికి స్పందించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ఆడేందుకు దుబాయ్ చేరుకున్న విరాట్.. ముందుగానే ఇక్కడికి రావాల్సి రావడం దురదృష్టకరమని అన్నాడు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో కనీసం ఐపీఎల్ కోసమైనా సురక్షితమైన బయో బబుల్ ఏర్పాటు చేయాలని కోహ్లి అభిప్రాయపడ్డాడు. టీమిండియాలోని జూనియర్ ఫిజియో యోగేశ్ పార్మర్ కరోనా బారిన పడటంతో చివరి టెస్ట్ బరిలోకి దిగడానికి కోహ్లితోపాటు ఇతర ప్లేయర్స్ నిరాకరించారు.
దీనిపై విరాట్ స్పందిస్తూ.. ఇక్కడికి ఇలా ముందుగానే రావాల్సి రావడం దురదృష్టకరం. కానీ కొవిడ్ కాలంలో అనిశ్చితి నెలకొంది. ఏ సమయంలో ఏదైనా జరగొచ్చు. కనీసం ఐపీఎల్ కోసమైనా సురక్షితమైన, దృఢమైన బబుల్ ఏర్పాటు చేశారని ఆశిస్తున్నా అని ఆర్సీబీ డిజిటల్ మీడియతో కోహ్లి చెప్పాడు. ఈ ఐపీఎల్ ఆర్సీబీ టీమ్లోని తమతోపాటు టీ20 వరల్డ్కప్ కోసం టీమిండియాకు కూడా చాలా ముఖ్యమైనది విరాట్ అభిప్రాయపడ్డాడు.
ఆదివారం ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుండగా.. ఆర్సీబీ సోమవారం కోల్కతాతో తలపడనుంది. మిగిలిపోయి టోర్నీకి కొందరు కీలకమైన ప్లేయర్స్ మిస్ అవుతున్నా.. వారి స్థానాలను నాణ్యమైన ప్లేయర్స్తో భర్తీ చేసినట్లు కోహ్లి చెప్పాడు.