Sunil Gavaskar | భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లు కొంత మంది తమ కెరీర్కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. టీ20 ప్రపంచకప్లో భాగంగా నిన్న ఇంగ్లాండ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్య జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని చెప్పారు.
‘ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్య తొలిసారే ట్రోఫీని అందించాడు. కాబట్టి భవిష్యత్తులో టీమిండియా బాధ్యతలు అతడికి అప్పగించే అవకాశం లేకపోలేదు. భవిత్యత్తులో అతను కచ్చితంగా టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడు. ఇప్పుడు కొంతమంది ఆటగాళ్లు రిటైర్మెంట్ తీసుకోవచ్చు. దీని గురించి వారు తప్పకుండా ఆలోచిస్తారు’ అని గవాస్కర్ పేర్కొన్నారు.