న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలం తర్వాత స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్నకు మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, లెఫ్టార్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను ఎంపిక చేస్తే బాగుండేదని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ప్రస్తుత టీమ్లో వారిద్దరి లోటు కనిపిస్తున్నదని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. ‘కొత్త బంతితో చక్కటి ప్రదర్శన చేసే అర్ష్దీప్ను ఎందుకు ఎంపిక చేయలేదో అర్థం కాలేదు.
తొలి స్పెల్లోనే జట్టుకు శుభారంభం ఇవ్వగల సత్తా అతడిలో ఉంది. ఆస్ట్రేలియాకు మిషెల్ స్టార్క్, పాకిస్థాన్కు షాహీన్ షా అఫ్రిదిలా ఆరంభంలోనే వికెట్లు తీసే అర్ష్దీప్ను జట్టులోకి తీసుకోవాల్సింది. ఇప్పటికే పలుమార్లు మ్యాచ్ విన్నర్గా నిరూపించుకున్న చాహల్ను కూడా ఎంపిక చేయాల్సింది’ అని భజ్జీ అన్నాడు.