హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) వ్యవస్థాపక అధ్యక్షుడు, మంత్రి శ్రీనివాస్గౌడ్ పుట్టిన రోజును పురస్కరించుకుని నిర్వహించిన క్రికెట్ టోర్నీలో టీజీవో సెంట్రల్ టీమ్ విజయం సాధించింది. మంగళవారం జరిగిన ఫైనల్లో టీజీవో సెంట్రల్ టీమ్..టీజీవో హైదరాబాద్ జట్టుపై విజయం సాధించింది. ఈ సందర్భంగా టీజీవో అధ్యక్షురాలు మమత గెలిచిన టీమ్ను అభినందించారు. ముగింపు కార్యక్రమంలో టీజీవో నాయకులు సత్యనారాయణ, రవీందర్రావు, సహదేవ్, మధుసూదన్గౌడ్, కృష్ణమూర్తి, రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.