ఫుణె: మహిళల టీ20 చాలెంజ్లో వెలాసిటీ జట్టు అదరగొట్టింది. మంగళవారం జరిగిన పోరులో దీప్తి శర్మ సారథ్యంలోని వెలాసిటీ జట్టు 7 వికెట్ల తేడాతో సూపర్ నోవాస్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నోవాస్.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.
కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (51 బంతుల్లో 71; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టగా.. తానియా భాటియా (36) అండగా నిలిచింది. అనంతరం ఛేదనలో వెలాసిటీ18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. యువ ఓపెనర్ షఫాలీ వర్మ (33 బంతుల్లో 51; 9 ఫోర్లు, ఒక సిక్సర్), లౌరా వాల్వర్ట్ (35 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకాలతో విజృంభించారు. సూపర్ నోవాస్ ఓడినా.. ఆ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.