పుణె: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) టోర్నీలో హోరాహోరీ పోరు జరుగుతోంది. బుధవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో గోవా చాలెంజర్స్ 9-6తో యు ముంబాపై అద్భుత విజయం సాధించింది. దీంతో ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింటిలో గెలిచిన గోవా 26 పాయింట్లతో టాప్లో కొనసాగుతున్నది. పురుషుల సింగిల్స్లో హర్మిత్దేశాయ్ 10-11, 11-7, 11-8తో మానవ్ థక్కర్పై సంచలన విజయం సాధించాడు.