చాదర్ఘాట్ : యూఎస్ఏ ఓపెన్ కరాటే చాంపియన్షిప్లో రాష్ట్ర ప్లేయర్లు అదగొట్టారు. యూఎస్ కరాటే ఫెడరేషన్ నిర్వహించిన ఈ ఈవెంట్లో నగరానికి చెందిన సయ్యద్మహ్మద్ హుస్సేన్(65కి), మహమ్మద్ ఫతే అలీ(60కి) స్వర్ణ పతకాలు దక్కించుకోగా, సయిదా ఫరీదాకు రజతం, సయిదా షఫియా సుల్తానా కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ప్లేయర్లతో పాటు జాతీయ కోచ్ మాస్టర్ ఇఫ్తేకార్ హుస్సేన్ను క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు.