న్యూఢిల్లీ: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ జాతరకు రంగం సిద్ధమైంది. పదిహేనేండ్లుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న ఐపీఎల్-16వ సీజన్ వచ్చే నెల ఆఖరి నుంచి ప్రారంభం కానుంది. మార్చి 31న అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్తో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది.
52 రోజుల పాటు సాగనున్న లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్లు జరుగనున్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్ తొలి పోరులో రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. గత కొన్ని సీజన్లుగా తమ అభిమాన క్రికెటర్ల ఆటను ప్రత్యక్షంగా చూడలేకపోయిన హైదరాబాద్ వాసులకు ఈ సారి ఉప్పల్లో సన్రైజర్స్ 7 మ్యాచ్లు ఆడనుంది.