WT20 World Cup | కేప్ టౌన్: సొంతగడ్డపై జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 6 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. సఫారీ జట్టు ఐసీసీ మహిళల టీ20 ప్రంపచకప్ ఫైనల్కు అర్హత సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
మొదట దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. వాల్వర్ట్ (53), బ్రిట్స్ (68) హాఫ్సెంచరీలు నమోదు చేశారు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 రన్స్కే పరిమితమైంది. సఫారీ బౌలర్లలో అయబొంగా 4, షబ్నమ్ 3 వికెట్లు పడగొట్టారు. ఆదివారం జరుగనున్న వరల్డ్కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా అమీతుమీ తేల్చుకోనుంది.