మెదక్ : ప్రమాదవాశాత్తు చెట్టు పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని పాపన్నపేట మండలం చిత్రియాల గ్రామ శివారులో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన పుట్టి దుర్గయ్య(45) చెట్టుపై తేనె తీయడానికి వెళ్లిన కాలుజారి కిందపడి మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.