ముంబై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ లీగ్ (యూటీటీ) నాలుగో సీజన్ షెడ్యూల్ సోమవారం విడుదలైంది. పుణెలోని బలేవాడీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జూలై 13 నుంచి 30వ తేదీ వరకు యూటీటీ చాంపియన్షిప్ జరుగనుంది. మొత్తం ఆరు ఫ్రాంచైజీలు లీగ్లో తలపడనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై లయన్స్, పుణెరి పల్టాన్ మధ్య మ్యాచ్తో లీగ్కు తెరలేవనుంది.
లీగ్లో మొత్తం 18 మ్యాచ్లు జరుగనుండగా, జూలై 28, 29తేదీల్లో సెమీఫైనల్స్, 30వ తేదీన ఫైనల్ పోరు జరుగుతుంది. చెన్నై, పుణెతో పాటు బెంగళూరు స్మాషర్స్, దబాంగ్ ఢిల్లీ, గోవా చాలెంజర్స్, యూ ముంబా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. యూటీటీ లీగ్లో ఈసారి ఖాద్రీ, లిలీజాంగ్, శరత్కమల్, మని బాత్రా, సాతియాన్, శ్రీజ, స్నేహిత్ లాంటి స్టార్ ప్లేయర్లు పోటీకి సై అంటున్నారు.