రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అన్బాక్స్ ప్రోగ్రామ్ మంగళవారం చిన్నస్వామి స్టేడియంలో అట్టహాసంగా జరిగింది. కిక్కిరిసిన ప్రేక్షకుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్సీబీ జెర్సీని ఆవిష్కరించారు.
కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ కొత్త జెర్సీలు ధరించి అభిమానులను అలరించారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూపీఎల్ విన్నింగ్ కెప్టెన్ స్మృతి మందన తదితరులు పాల్గొన్నారు.