హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్ వేదికగా మంగళవారం నుంచి ప్రతిష్టాత్మక తెలంగాణ గోల్కొండ గోల్ఫ్ మాస్టర్స్ టోర్నీ నుంచి మొదలుకానుంది. ఈనెల 26వ తేదీ వరకు జరిగే టోర్నీలో మొత్తం 123 మంది జాతీయ, అంతర్జాతీయ గోల్ఫర్లు పోటీలో ఉన్నారు. భారత టాప్ గోల్ఫర్లు అర్జున్ ప్రసాద్, ఉదయన్ మానె, శౌర్య భట్టాచార్యతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, యూరప్ దేశాలకు చెందిన ఇంటర్నేషనల్ స్టార్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
టోర్నీ కోసం కోటి రూపాయల ప్రైజమనీ ప్రకటించారు. ఇందులో ప్రపంచ గోల్ఫ్ ర్యాంకింగ్ పాయింట్లు కూడా ఉండటంతో ప్లేయర్ల మధ్య హోరాహోరీ పోరు జరుగనుంది. సోమవారం ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో గోల్ఫర్లు అర్జున్ ప్రసాద్, స్టెఫాన్ డానెక్, పీజీటీఐ డైరెక్టర్ వికాస్సింగ్, కెప్టెన్ జస్విందర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.