హైదరాబాద్, ఆట ప్రతినిధి: బ్యాడ్మింటన్, టెన్నిస్ కలయికతో కొత్తగా రూపుదిద్దుకున్న పికిల్బాల్కు హైదరాబాద్లో ఆదరణ అంతకంతకూ పెరుగుతున్నది. తెలంగాణ పికిల్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో మూడు కోర్టులను గేమ్ పాయింట్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
పికిల్బాల్ క్రీడను మరింత వ్యాప్తి చేసే ఉద్దేశంతో కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 16 రాష్ర్టాలకు పికిల్బాల్ చేరువైందని, 3 వేల మంది ప్లేయర్లు ఈ ఆటతో మమేకమయ్యారని వారు తెలిపారు.