మహబూబ్నగర్ టౌన్, జనవరి 13: జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జాతీయ స్థాయి ఫాస్ట్-5 మహిళల, పురుషుల నెట్బాల్ చాంపియన్షిప్ టోర్నీ శనివారం ఘనంగా ప్రారంభమైంది. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, నెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ విజేందర్సింగ్ క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు.
తొలి రోజు పురుషుల విభాగంలో జరిగిన మ్యాచ్లో హర్యానా జట్టు 44-22తో ఏపీపై ఘన విజయం సాధించింది. మహిళల కేటగిరీలో బీహార్29-11 తేడాతో ఏపీపై గెలిచింది.