కోల్కతా: దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ముంబై జట్టు చేజిక్కించుకుంది. శనివారం జరిగిన తుదిపోరులో ముంబై 3 వికెట్ల తేడాతో హిమాచల్ ప్రదేశ్ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన హిమాచల్ ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. ఏకాంత్ సేన్ (37) టాప్ స్కోరర్ కాగా.. ముంబై బౌలర్లలో మొహిత్ అవస్థి, తనుష్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో ముంబై 19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 రన్స్ చేసింది. సర్ఫరాజ్ ఖాన్ (36 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (34) రాణించారు.