హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశంలోనే అతిపెద్ద గ్రామీణ క్రీడా ఉత్సవానికి రంగం సిద్ధమైంది. మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభను వెలుగులోకి తేవాలనే ఉద్దేశంతో సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రారంభించిన ‘ఇషా గ్రామోత్సవం’ రేపటి నుంచి ప్రారంభం కానుంది.
సెప్టెంబర్ 23 వరకు దక్షిణ భారత మంతటా జరుగనున్న ఇషా 15వ గ్రామోత్సవానికి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. గ్రామీణ క్రీడలైన కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, త్రోబాల్ వంటి ఎన్నో క్రీడాంశాల్లో పురుషులు, మహిళలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించనున్నారు. వివరాల కోసం 83000 30999 నంబర్ను సంప్రదించండి.