న్యూఢిల్లీ: ఐపీఎల్ వేలం పాటకు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఈ నెల 19న జరిగే వేలంలో 77 స్థానాల కోసం మొత్తం 333 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. టీమ్ఇండియా పేసర్లు ఉమేశ్యాదవ్, హర్షల్ పటేల్, శార్దుల్ ఠాకూర్..రెండు కోట్ల కనీస ధరతో వేలంలోకి ప్రవేశిస్తున్నారు. ఇందులో 214 మంది భారత క్రికెటర్లు కాగా, 119 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు.
77 బెర్తుల కోసం పది ఫ్రాంచైజీలు రూ.262 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఇటీవలే రికార్డు స్థాయిలో ఆరోసారి ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా ప్లేయర్లకు వేలంలో మంచి డిమాండ్ పలికే అవకాశముంది. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, జోస్ ఇంగ్లిస్, మిచెల్ స్టార్క్..రెండు కోట్ల కేటగిరీలో ఉన్నారు. వీరికి తోడు న్యూజిలాండ్ యువ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రకు భారీ ధర వచ్చే చాన్స్ ఉంది.