స్టెల్లెన్బాష్(దక్షిణాఫ్రికా): మహిళల టీ20 ప్రపంచకప్నకు ముందు బంగ్లాదేశ్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో భారత మహిళల జట్టు 52 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత భారత్ 5 వికెట్లకు 183 పరుగులు చేయగా సమాధానంగా బంగ్లాదేశ్ 8 వికెట్లకు 131 పరుగులే చేయగలిగింది. భారత జట్టులో రిచా ఘోష్ సుడిగాలి బ్యాటింగ్తో విజృంభించింది. రిచా 56 బంతుల్లో 9 సిక్సర్లు, 3 ఫోర్లతో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచి భారీ స్కోరుకు దోహదం చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (41) రాణించింది.