న్యూఢిల్లీ: తాష్కెంట్ వేదికగా ఉజ్బెకిస్థాన్తో జరిగే అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ల కోసం భారత మహిళల జట్టును సోమవారం ప్రకటించారు. మొత్తం 23 మందితో కూడిన జాతీయ జట్టులో తెలంగాణ యువ ఫుట్బాలర్ గుగులోతు సౌమ్య చోటు దక్కించుకుంది.
ఈ నెల 31, జూన్ 4వ తేదీన భారత్, ఉజ్బెకిస్థాన్ జట్ల మధ్య రెండు మ్యాచ్లు జరుగుతాయి. ఇందుకోసం హైదరాబాద్లోని శ్రీనిధి దక్కన్ ఎరీనాలో 30 మందితో కూడిన మహిళల టీమ్ సన్నాహక శిబిరంలో పాల్గొంది. టోర్నీ కోసం బుధవారం భారత జట్టును ఉజ్బెకిస్థాన్ బయల్దేరి వెళ్లనుంది.