లిలెహామర్(నార్వే): నార్వేతో జరుగుతున్న డేవిస్కప్ గ్రూప్-1 పోరులో భారత జట్టు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్లలో ఓడిన భారత్ శనివారం డబుల్స్ పోరాటంలో కూడా ఓటమి చవిచూసింది. దీనితో నార్వే 3-0 ఆధిక్యం సాధించి తదుపరి రౌండ్కు అర్హత సాధించింది. డబుల్స్లో నార్వే జోడీ కాస్పర్ రూడ్-విక్టర్ దురసోవిచ్ 6-3, 3-6, 6-3తో భారత్ జోడీ యుకి బాంబ్రి-సాకేత్ మైనేనిపై విజయం సాధించింది. అంతకుముందు సింగిల్స్ తొలి మ్యాచ్లో ప్రపంచ నంబర్2 కాస్పర్ రూడ్ 6-1, 6-4తో ప్రజ్ఞేష్ గుణేశ్వరన్పై గెలుపొంది నార్వేకు శుభారంభం అందించగా, రెండో మ్యాచ్లో భారత నంబర్వన్ రామ్కుమార్ రామ్నాథన్ అంచనాలకు తగ్గ ఆటను ప్రదర్శించలేకపోవడంతో విక్టర్ చేతిలో 1-6, 4-6 స్కోరుతో ఓడిపోయాడు. ఇప్పటికే నార్వే 3-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలవడంతో ఇక రివర్స్ సింగిల్స్ ఆడాల్సిన అవసరం లేకపోయింది.