బర్మింగ్హామ్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు.. బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ సెమీఫైనల్కు అర్హత సాధించింది. బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పోరులో హర్మన్ప్రీత్ బృందం 100 పరుగుల తేడాతో బార్బడోస్పై జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
జెమీమా రోడ్రిగ్స్ (46 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో రాణించగా.. షఫాలీ (26 బంతుల్లో 43; 7 ఫోర్లు, ఒక సిక్సర్) పిడుగుల్లాంటి షాట్లతో ప్రత్యర్థిని వణికించింది. చివర్లో దీప్తి శర్మ (34 నాటౌట్) విలువైన పరుగులు చేయడంతో భారత్ మంచి స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో బార్బడోస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 62 పరుగులే చేయగలిగింది.
ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్లో సంచలన బౌలింగ్ ప్రదర్శన కనబర్చి ప్రశంసలందుకున్న రేణుక.. మరోసారి రెచ్చిపోయింది. తొలి నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకొని అదుర్స్ అనిపించుకుంది. 4 ఓవర్లలో 10 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టడంతో ఆరంభంలోనే మ్యాచ్పై టీమ్ఇండియా పట్టుబిగించింది. ఇక ఇతర బౌలర్లు కూడా ఆమెకు సహకరించడంతో బార్బడోస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.
భారత్: 20 ఓవర్లలో 162/4 (జెమీమా 56 నాటౌట్, షఫాలీ 43; బ్రూస్ 1/17), బార్బడోస్: 20 ఓవర్లలో 62/8 (కిషోనా నైట్ 16; రేణుక 4/10).