న్యూఢిల్లీ: ఆసియా కప్ టోర్నీ కోసం భారత జట్టును ఎంపిక చేశారు. ఈనెల 27 నుంచి దుబాయ్లో జరుగనున్న టోర్నీ కోసం బీసీసీఐ సోమవారం 15 మందితో జట్టును ప్రకటించింది. స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తిరిగి జట్టుకు ఎంపికయ్యారు. ఇంగ్లండ్తో సిరీస్ తర్వాత విరామం తీసుకున్న విరాట్, గాయం నుంచి కోలుకున్న రాహుల్కు సెలెక్టర్లు జట్టులో చోటు కల్పించారు. ఆస్ట్రేలియా వేదికగా త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలకు పోకుండా కోర్ టీమ్ను ఎంపిక చేశారు.
జట్టుకు రోహిత్శర్మ నాయకత్వం వహించనుండగా, రాహుల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. యార్కర్ స్పెషలిస్టు జస్ప్రీత్ బుమ్రా గాయంతో జట్టుకు దూరం కాగా, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించనున్నాడు. భువనేశ్వర్కు తోడు అర్ష్దీప్సింగ్, అవెశ్ఖాన్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పేస్ బౌలింగ్ బాధ్యతలను మోయనున్నారు. స్పిన్నర్లు అశ్విన్, చాహల్, జడేజా, బిష్ణోయ్ చాన్స్ లభించింది. రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ వికెట్కీపర్లుగా వ్యవహరిస్తారు. ముగ్గురిని స్టాండ్బైగా ఎంపిక చేశారు. ఇందులో శ్రేయాస్ అయ్యర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు.