బ్యాంకాక్: ఏషియన్ రిలే చాంపియన్షిప్లో భారత పురుషుల, మహిళల 4X400 మీటర్ల రిలే జట్లు రజతంతో సరిపెట్టుకున్నాయి. బ్యాంకాక్ వేదికగా మంగళవారం జరిగిన రిలేలో మహ్మద్ అనాస్, సంతోష్ కుమార్, మిజో చాకో, అరోకియా రాజీవ్తో కూడిన పురుషుల జట్టు.. 3 నిమిషాల 05.76 సెకన్లల్లో గమ్యాన్ని పూర్తిచేసి రెండో స్థానంలో నిలిచింది.
శ్రీలంక బృందం (3:04.48) స్వర్ణం గెలుచుకోగా వియత్నాం (3:07.37) కాంస్యం నెగ్గింది. విథ్యా రామ్రాజ్, పూవమ్మ, రూపల్, ప్రాచి చౌదరితో కూడిన మహిళల బృందం.. 3 నిమిషాల 33.55 సెకన్లతో రజతం గెలవగా వియత్నాం (3:30.81), జపాన్ (3:36.56) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు గెలుచుకున్నాయి.